వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

by Mahesh |
వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న నగరి నియోజకవర్గంలో షర్మిల మాట్లాడుతూ.. ఐరన్ లెగ్ రోజా అని కామెంట్స్ చేసింది. వైఎస్ కూతురిని అయిన నన్ను విమర్శించే హక్కు రోజాకు లేదని షర్మిల ఫైర్ అయ్యారు. అలాగే ఏపీలో అభివృద్ధి జరిగే వరకు పోలవరం పూర్తయ్యేవరకు తాను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ.. షర్మిల ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అని తెలిపింది. అలాగే షర్మిల వైఎస్ కూతుర అనే అర్హత తప్ప ఆమెకు ఏపీలో తిరగడానికి ఏ అర్హత లేదని.. వైఎస్ షర్మిల టైంపాస్ కోసమే రాజకీయాలు చేస్తుందని మంత్రి రోజా విమర్శించారు. దీంతో ఏపీలో షర్మిల, రోజా మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.



Next Story